సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ సమీపంలో భారీ పేలుడు

30 Mar, 2019 12:45 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో రంబన్‌ జిల్లాలోని బనీహల్‌లో శ్రీనగర్‌ హైవేపై ఓ కారులో శనివారం ఉదయం భారీ పేలుడు చోటుచేసుకుంది. దీనికి సమీపంలోనే సీఆర్‌పీఎఫ్‌కు సంబంధించిన కాన్వాయ్‌ ఉండటంతో ఉగ్రవాదులపనేనా అన్నకోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

అయితే కారులో సిలిండర్‌ లీక్‌ వల్లే పేలుడు చోటుచేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులలో అధికారులు ఓ అంచనాకు వచ్చారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కొద్ది రోజుల కిందటే పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఓ ఉగ్రవాది స్కార్పియో కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అత్యాధునిక పేలుడు పదార్థాలున్న(ఐఈడీ) తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు