కానిస్టేబుల్‌ నియామక పరీక్ష... ఛాతిపై కులం పేరు

29 Apr, 2018 19:43 IST|Sakshi
ఛాతీ కొలుస్తున్న పోలీసు అధికారులు

మధ్యప్రదేశ్‌లో అధికారుల నిర్వాకం  

భోపాల్‌: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై వారి కులం పేరును స్కెచ్‌తో రాసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఇటీవల పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 200 మంది అభ్యర్థులకు జిల్లా మెడికల్‌ బోర్డు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించింది.

ఈ సందర్భంగా అభ్యర్థుల ఛాతీపై ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓబీసీ అని స్కెచ్‌ పెన్‌తో రాశారు. ఈ విషయమై ధార్‌ ఎస్పీ వీరేంద్ర సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వేర్వేరు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కావాల్సిన శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నందున అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాసినట్లు వైద్య సిబ్బంది పోలీసులకు చెప్పారన్నారు. ఏదేమైనా ఇది తీవ్రమైన వ్యవహారమనీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు