పోంజి స్కామ్‌.. కర్ణాటకలో సీబీఐ దాడులు

9 Nov, 2019 04:26 IST|Sakshi

న్యూఢిల్లీ:  కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లోని పలువు రు సీనియర్‌ అధికారుల నివాసాలు, కార్యాల యాలపై సీబీఐ శుక్రవారం దాడులు నిర్వహించింది. ఐఎమ్‌ఏ (ఐ–మానిటరీ అడ్వైజరీ) పోంజి స్కామ్‌తో సంబంధం ఉన్న అధికారుల ఇళ్లపై సోదాలు జరిపింది. బెంగళూరులోని 11 ప్రాంతాలు, మాండ్య, రామనగరా, బెల్గాంలలో ఒక్కో ప్రాంతంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సోదాలు నిర్వహించింది. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌లో ఎకనామిక్స్‌ అఫెన్సెస్‌ విభాగం ఐజీ హేమంత్‌ నింబాల్కర్, డీఎస్పీ ఈబీ శ్రీధర, ఈస్ట్‌ బెంగళూరు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్‌ హిలోరీ సహా పలువురు అధికారుల నివాసాలపై సీబీఐ శుక్రవారం సోదాలు జరిపింది.

మరిన్ని వార్తలు