గౌహితికి నో, ముంబయిలో అయితే ఓకే

22 Dec, 2016 15:50 IST|Sakshi
ఇంద్రాణి ముఖర్జీయాకు చుక్కెదురు

న్యూఢిల్లీ:  షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీకి చుక్కెదురు అయింది. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గౌహతి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. అయితే పోలీస్‌ భద్రత మధ్య ముంబయిలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. అలాగే ఇంద్రాణి ముఖర్జీ మీడియాతో మాట్లాడరాదని ఆదేశాలు ఇచ్చింది.

కాగా 2012 ఏప్రిల్ నెలలో కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు