'వైద్యుడే ఆ హత్య చేయించాడు'

7 Sep, 2016 16:17 IST|Sakshi
'వైద్యుడే ఆ హత్య చేయించాడు'

ముంబయి: ప్రముఖ సామాజిక వేత్త, హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు అయిన నరేంద్ర దాబోల్కర్ హత్య కేసులో ఓ వైద్యుడే కీలక కుట్రదారు అని సీబీఐ తేల్చింది. ఈ మేరకు పుణెలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి నివేదికి ఇచ్చినట్లు తెలిసింది. మరో ఇద్దరు పేర్లను కూడా సీబీఐ అధికారులు చేర్చారు.

ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసిన వీరేంద్ర సింగ్ తావ్డేనే అసలైన కీలక నేరస్తుడు అని సీబీఐ స్పష్టం చేసింది. ఈఎన్టీ వైద్యుడిగా పనిచేస్తున్న హిందు జన జాగృతి సభ్యుడు తావ్డేకు దబోల్కర్ హత్య చేయించారని సీబీఐ ఆ ఛార్జీషీటు నివేదికలో చెప్పింది. పట్టపగలు అతి దారుణంగా దబోల్కర్ను 2013 ఆగస్ట్ 20న ఆగంతకులు దారుణంగా చంపారు. దబోల్కర్ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

మరిన్ని వార్తలు