నళిని చిదంబరానికి సీబీఐ సమన్లు

4 Mar, 2016 13:57 IST|Sakshi
నళిని చిదంబరానికి సీబీఐ సమన్లు

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం సతీమణి నళినీ చిదంబరానికి శుక్రవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న కోల్కతాలోని సీబీఐ కార్యాలయానికి ఆమె హాజరు కావాల్సి ఉంది.

శారదా కేసుకు సంబంధించి గతంలో సీబీఐ నమోదు చేసిన ఆరో అనుబంధ చార్జ్ షీట్లో నళిని చిదంబరం పేరును ప్రస్తావించింది. అయితే ఈ కేసులో నిందితురాలిగా గానీ, సాక్షిగా గానీ నళిని పేరును ప్రస్తావించని సీబీఐ.. వివాదాస్పద చానెల్ ఒప్పంద విషయంలో ఆమె వద్ద నుంచి సమాచారాన్ని రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు