31 నుంచి బడ్జెట్‌ పార్లమెంటు !

9 Jan, 2020 06:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ప్రతిపాదించింది. ఈనెల 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు విడతల్లో నిర్వహించాలని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం చెప్పాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత, మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారని తెలిపాయి. రెండు విడతల మధ్య ఉండే విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్‌ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి.

మరిన్ని వార్తలు