సిమెంటు మరింత ప్రియం

1 Mar, 2015 02:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకాలు, రవాణా చార్జీల మోతతో సిమెంటు రేట్లు గణనీయంగా పెరగనున్నాయి. బస్తా ధర రూ. 15-20 మేర పెరగనుంది. టన్ను సిమెంటుపై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 100 మేర పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌లో రవాణా చార్జీలు పెంచడం వల్ల ఇప్పటికే సిమెంట్ తయారీ వ్యయం రూ. 7-10 పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. బొగ్గుపై టన్నుకు రూ.200 చొప్పున హరిత ఇంధన సెస్సు కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నాయి.
 

మరిన్ని వార్తలు