ఎరువుల ధరలు తగ్గించిన కేంద్రం

4 Jul, 2016 19:23 IST|Sakshi
ఎరువుల ధరలు తగ్గించిన కేంద్రం

ఏరువాక సమయంలో ఉన్న రైతులకు తీపి కబురు.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎరువుల ధరలను తగ్గించింది. టన్ను డీఏపీకి రూ. 2500 చొప్పున తగ్గింది. అలాగే 50 కిలోల డీఏపీ బస్తా మీద రూ. 125 చొప్పున తగ్గించారు. టన్ను ఎంఓపీపై రూ. 5000 చొప్పున తగ్గించారు.

అంటే 50 కిలోల ఎంఓపీ బస్తాకు రూ. 250 చొప్పన తగ్గింది. ఒక టన్ను ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువు మీద రూ. వెయ్యి చొప్పున తగ్గించారు. అంటే 50 కిలోల ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువు మీద రూ. 50 తగ్గింది.

మరిన్ని వార్తలు