ఏపీ ట్రైబ్యునల్ నుంచి తెలంగాణ ఔట్

15 Sep, 2016 23:00 IST|Sakshi

ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కేంద్రం గురువారం రాత్రి ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ లో కొనసాగడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ తాజా గెజిట్ విడుదల చేసింది. త్వరలో తెలంగాణకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు