'పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలి'

29 Apr, 2016 15:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై శుక్రవారం రాజ్యసభలో చర్చ వాడీవేడిగా కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ రెవిన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాలంటూ రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయలన్నారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ముంపు మండలాలను ఏపీలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన ఈ సందర్భంగా  గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు