‘తెలంగాణ మాదిరిగానే బాబుకు బుద్ది చెప్తారు’

7 Jan, 2019 13:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కృతజ్ఞతలు తెలుపుతూ టీడీపీ ప్రభుత్వం గతంలో తీర్మానం కూడా చేసిందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ గుర్తుచేశారు. హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని టీడీపీ అంగీకరించదన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసమంటూ టీడీపీ ఎంపీలు ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు సంబరాలు చేసుకుని ఇప్పుడు ఆందోళన చేస్తున్నారని అన్నారు. 

తెలంగాణలో టీడీపీకి బుద్ది చెప్పినట్లే ఏపీలోకూడా ప్రజలు బుద్ది చెప్తుతారని వ్యాఖ్యానించారు. దుష్టకూటమికి చంద్రబాబు ఏపీలో కూడా ప్రయత్నిస్తున్నారని, దానిని తెలంగాణ ప్రజల మాదిరిగానే తిరస్కరిస్కారని గోయల్‌ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్‌ సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు