కేంద్రం అలర్ట్‌ : ముఖ్యమంత్రులకు ముప్పు

1 Jan, 2018 16:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రులకు భద్రతాపరమైన ముప్పు ఉందని హెచ్చరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో పర్యటించే సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరింది. ఆకస్మిక పర్యటనల్లో సీఎంలపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఇంటిలిజెన్స్‌ పక్కా సమాచారంతోనే కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు