రాజ్నాథ్తో చంద్రబాబు భేటీ

10 Jul, 2015 14:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. శుక్రవారం చంద్రబాబు.. రాజ్నాథ్తో 'ఓటుకు కోట్లు', సెక్షన్-8 అంశాలపై చర్చించారు.

చంద్రబాబు అంతకుముందు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్లను కలిశారు. చంద్రబాబు జపాన్ పర్యటన ముగించుకుని గురువారం ఢిల్లీ వచ్చారు. ఈ రోజు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు కాసేపట్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

>
మరిన్ని వార్తలు