తిరుమలలో చత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్

1 Aug, 2015 07:36 IST|Sakshi
తిరుమలలో చత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్

తిరుమలః చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ శ్రీవారి దర్శనార్ధం శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 10.50 గంటలకు ఆయన స్థానిక అదిత్యబిర్లా అతిథి గృహానికి చేరుకున్నారు. తిరుమల చేరుకున్న రమణ్ సింగ్‌కు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, బోర్డు సభ్యుడు భానుప్రకాష్, రిసెప్షన్ డెప్యూటీఈవో ఆర్1 రామారావు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం బస, దర్శనం ఏర్పాట్లు చేశారు. రమణ్‌సింగ్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

మరిన్ని వార్తలు