పక్షి ఢీ.. తప్పిన పెను ప్రమాదం!

16 Nov, 2017 08:48 IST|Sakshi

సాక్షి, చెన్నై : ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దోహాకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్ అయిన విమానాన్ని కొంత సమయానికే ఓ పక్షి ఢీకొట్టింది. ఏదో సమస్య తలెత్తిందని గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ చెన్నై విమానాశ్రయానికి తీసుకెళ్లి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (2:15 గంటలకు) ఇండిగో విమానం చెన్నైకి చేరినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

ఆ విమానంలోని 134 మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనకు గురయ్యారు. గురువారం వేకువ జామున 4:30 గంటలకు మరో విమానాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ సిద్ధం చేసింది. ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఆ విమానంలో దోహాకు బయలుదేరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వేరే విమానంలో ప్రయాణించే ఏర్పాట్లు చేశామన్నారు.

మరిన్ని వార్తలు