దత్తాత్రేయకు చత్తీస్గఢ్ సీఎం ఫోన్

2 Nov, 2014 16:33 IST|Sakshi
దత్తాత్రేయకు చత్తీస్గఢ్ సీఎం ఫోన్

హైదరాబాద్: బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆదివారం ఫోన్ చేశారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై రమణ్ సింగ్ ఆరా తీశారు.

రమణ్ సింగ్ దత్తాత్రేయను చత్తీస్గఢ్ రావాల్సిందిగా ఆహ్వానించారు. చత్తీస్గఢ్, తెలంగాణల మధ్య రేపు జరగనున్న విద్యుత్ ఎంవోయూలో పాల్గొనాల్సిందిగా దత్తాత్రేయను కోరారు. దత్తాత్రేయ కాసేపట్లో చత్తీస్గఢ్కు బయల్దేరనున్నారు.

మరిన్ని వార్తలు