బోరు బావిలో బాలుడు

12 Apr, 2015 13:41 IST|Sakshi

వెల్లోర్(తమిళనాడు): రెండున్నరేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అతడిని ప్రాణాలతో రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, సంబంధిత సిబ్బంది కఠోర శ్రమపడుతున్నారు. వెల్లోర్ జిల్లాలోని కూరంపడి అనే గ్రామంలో 250 మీటర్ల లోతుతో బోరు బావి వేసి అది ఎండిపోవడంతో ఎలాంటి మూతవేయకుండా వదిలేశారు. ఆదివారం ఉదయం ఆడుకుంటూ వెళ్లిన రెండున్నారేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. 20 మీటర్ల లోతులో బాలుడు ఇరుక్కు పోయినట్లు గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అతడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు