బాల్యవివాహం రేప్ కంటే దారుణం

7 Sep, 2014 11:27 IST|Sakshi
బాల్యవివాహం రేప్ కంటే దారుణం

న్యూఢిల్లీ: బాల్యవివాహాలపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కంటే బాల్యవివాహం దారుణమని పేర్కొంది. 14 ఏళ్ల వయసులోనే ఓ బాలికకు వివాహం చేశారు.

భర్త, అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆ బాలిక కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సమాజంలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని సూచించింది.

మరిన్ని వార్తలు