డోక్లాంలో చైనా నిర్మాణాలు

6 Mar, 2018 01:57 IST|Sakshi

రాజ్యసభలో రక్షణ మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: డోక్లాం సరిహద్దుల్లో చైనా హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులను నిర్మించిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. ‘2017లో డోక్లాం సరిహద్దుల్లో ఇరుదేశాలు బలగాలను వెనక్కు తీసుకున్నాయి. అయితే ఇటీవల మళ్లీ భారత్, చైనా దేశాలు మళ్లీ డోక్లాంలోని అదే ప్రాంతంలో తమ బలగాలు (తక్కువ సంఖ్యలో) మోహరించాయి.

శీతాకాలంలో ఈ బలగాలను నిర్వహించేందుకు చైనా ఆర్మీ హెలిప్యాడ్లు, సెంట్రీ పోస్టులు, కందకాలు నిర్మించింది’ అని మంత్రి తెలిపారు. ఉపగ్రహ చిత్రాల్లో యుద్ధట్యాంకులు, క్షిపణులను మోహరించటంతోపాటు సరిహద్దుల్లో చైనా ఏడు హెలిప్యాడ్లు నిర్మించినట్లు తెలుస్తోందంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్‌ ఈ సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు