ఘోర రైలు ప్రమాదం: 95 మంది మృతి

20 Nov, 2016 06:55 IST|Sakshi
ఘోర రైలు ప్రమాదం: 95 మంది మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వేకువజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 95 మందికి పైగా మృతిచెందినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అధికారుల కథనం ప్రకారం.. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 95మంది మృతిచెందగా, 100కు పైగా  ప్రయాణికులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.