ముంబై: మహారాష్ట్రకు చెందిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే(78) శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. ఈ నెల 16న ఉదయం కొల్హాపూర్లో తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా పన్సారే, ఆయన భార్యపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల్లో ఆయనకు మెడ, మోచేయి, మోకాలుపై తూటా గాయాలయ్యాయి. దాంతో అప్పటి నుంచి కొల్హాపూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను శుక్రవారం పరిస్థితి విషమించడంతో హెలికాప్టర్లో హుటాహుటిన ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రహదారి సుంకం వసూలుకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్న విషయం తెలిసిందే.