గూగుల్‌కు రూ. కోటి జరిమానా

28 Mar, 2014 03:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొరడా ఝళిపించింది. భారత్‌లో అనుచిత వాణిజ్య విధానాలను అనుసరించడంపై చేపట్టిన దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆ కంపెనీపై రూ. కోటి జరిమానా విధించింది.

 

సీసీఐ డెరైక్టర్ జనరల్ కోరిన సమాచారం ఇవ్వకుండా దర్యాప్తునకు సహకరించనందుకే కమిషన్ ఈ జరిమానా విధించిందని, ఇకపై సహకరించాలని ఆదేశించిందని ఈ మేరకు గురువారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు