‘విమానంలో దోమలున్నాయంటే.. కొట్టారు’

10 Apr, 2018 10:26 IST|Sakshi
బాధితుడు సౌరభ్‌ రాయ్‌

సాక్షి, న్యూఢిల్లీ : విమానంలో దోమలు ఉన్నాయని చెబితే తనపై ఇండిగో క్రూ సభ్యులు చేయి చేసుకున్నారని ఓ ప్రయాణీకుడు ఆరోపించారు. లక్నో నుంచి బెంగళూరుకు బయల్దేరిన విమానంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని తాను క్రూ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

అయితే, ప్రత్యామ్నాయం చూపడానికి బదులు క్రూ బృందం తనతో వాగ్వాదానికి దిగి, చేయి కూడా చేసుకుందని డా. సురభ్‌ రాయ్‌ ఆరోపించారు. తనను బెదిరించి, విమానంలో నుంచి దించేసి అవమానించారని అన్నారు.

మరిన్ని వార్తలు