ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీలో బొత్స

27 Mar, 2014 03:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చోటు దక్కింది. రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రెండు పీసీసీలు ఏర్పాటయ్యాయి. తెలంగాణకు ఇంతకుముందే స్క్రీనింగ్ కమిటీని నియమించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీని ఏఐసీసీ నియమించింది. దీనిలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవితోపాటు బొత్సకు కూడా చోటు లభించింది. వీరంతా ఈనెల 29న ఇందిరాభవన్‌లో సమావేశమవుతారు.

మరిన్ని వార్తలు