రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు వెళ్లి తనిఖీలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ఘాటుగా స్పందించారు. బీజేపీ తీరు సరికాదని, అధికారంలో ఉన్నంత మాత్రాన పోలీసులను ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. ఈ తరహా వ్యవహారం గుజరాత్లో నడుస్తుందేమో గానీ ఢిల్లీలో కాదని స్పష్టం చేశారు.
కాగా.. ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయన వ్యక్తిగత వివరాలపై ఆరా తీశారు. ఆయన ఎలా ఉంటారు, కళ్ల రంగు ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నలు కురిపించారు. తాము రొటీన్ చెకప్లో భాగంగానే వెళ్లి వివరాలను ఆరా తీసినట్లు పోలీసులు చెబుతున్నా.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.