యువతి కిడ్నాప్..ఎమ్మెల్యేపై కేసు నమోదు

28 Jan, 2016 17:42 IST|Sakshi
యువతి కిడ్నాప్..ఎమ్మెల్యేపై కేసు నమోదు

పాట్నా: 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలతో గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన బిహార్లోని  సోన్కుక్రా గ్రామంలో చోటుచేసుకుంది. యువతి తండ్రి అభయ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. గురువారం ఉదయం బిక్రం నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దార్థ్ తన కూతురుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అభయ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 363 కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని ఎస్పీ ద్రుతి సాయిలీ తెలిపారు. ఎమ్మెల్యే ఫోన్లో అందుబాటులో లేడని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని వార్తలు