న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ నాయకులు కొట్టిపారేశారు. కాంగ్రెస్ భావి నాయకుడు రాహులేనని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పాత తరం, యువ నేతల మధ్య అభిప్రాయభేదాలు, రాహుల్ నాయకత్వంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ ప్రతినిధి శోభా ఓజా స్పష్టత ఇచ్చారు.
'రాహుల్ జీ మా నేత. ఆయన నాయకత్వంలోనే పార్టీ పనిచేస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తాం. రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై ఎలాంటి సందేహాలు లేవు.' అన ఓజా చెప్పారు.