రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ

20 Jul, 2016 15:38 IST|Sakshi

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులకు ఆ పార్టీ బుధవారం విప్ జారీ చేసింది. శుక్రవారం వరకూ సభకు కచ్చితంగా హాజరుకావాలని పార్టీ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రయివేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు శుక్రవారం రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేస్తూ...కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు బిల్లుకు ఆమోదం తెలపాలని ఆదేశించింది. రాజ్యసభ చీఫ్ విప్ చతుర్వేది ఈ మేరకు విప్ జారీ చేశారు.


 

మరిన్ని వార్తలు