సాక్షి, బెంగుళూరు : భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనపై సోదాలు చేయిస్తుందని ఆరోపించారు. 12 సార్లు ఎన్నికల బరిలో నిలిచిన తనపై ఎప్పుడూ ఇలాంటి కుట్రలు జరగలేదని, బీజేపీ కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ప్రధాని రేంద్ర మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు.
కాగా ఎన్నికల కారణంగానే బీజేపీ సిద్దరామయ్యపై సోదాలు చేయిస్తుందని, కర్ణాటకలో హగ్ ఏర్పడబోతుందని ప్రముఖ సర్వేలు తెలిపిన నేపథ్యంలోనే ఎలాగన్న అధికారాన్ని హస్తం పార్టీ నుంచి లాక్కొని, తమ హస్తగతం చేసుకోవడానికి అని బీజేపీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని రాజకియ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.