కర్ణాటక ,మండ్య: కరోనా భయం వల్ల వీధిలో పడి ఉన్న రూ. 500 నోట్లను ఎవరూ ముట్టుకోకుండా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మండ్య జిల్లా పాండవపుర పట్టణంలో జరిగింది. పట్టణంలోని గాణిగర వీధిలో రూ. 500 నోట్లు 6 పడి ఉండడం కొందరు చూశారు. ఆ నోట్లకు కరోనా వైరస్ అంటుకుని ఉంటుందని, ముట్టుకుంటే తమకు వస్తుందని స్థానికులు భయపడ్డారు. ఎస్ఐ సుమారాణి, పోలీసులు వచ్చి నోట్లకు శానిటైజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పోగొట్టుకుని ఉంటే పోలీసు స్టేషన్కు వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.(సారీ.. హలీమ్)