సాక్షి, చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 2,532 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 59,377కు చేరింది. ఇక కరోనా బారిన పడి ఆదివారం మరో 53 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 757కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,863 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి : కరోనా పోరు: కేంద్రం మరో కీలక నిర్ణయం)
ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 4.10 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 13,254 మంది కరోనాతో మృతి చెందారు. 2,27,756 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రధానంగా మహరాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో కరోనా పంజా విసురుతోంది. మరణాల సంఖ్యలో ప్రపంచంలో భారత్ 8వ స్థానంలో ఉంది. (చదవండి : నయన్-విఘ్నేశ్లకు కరోనా సోకిందా?)