సాక్షి, ముంబై : కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర చిగురుటాగులా వణుకుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా మరో 55 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో మొత్తంగా మహారాష్ట్రలో ఆదివారం సాయంత్రం నాటికి కరోనా కేసుల సంఖ్య 690కి చేరింది. వీటిలో ఒక్క ముంబై నగరంలోనే 330 కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్తగా నమోదైన 55 కేసుల్లో ముంబైలో 29, పుణేలో 17, జౌరంగబాద్లో 2, అహ్మద్ నగర్లో 3 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
(చదవండి: కరోనా కలకలం : 24 గంటల్లో 472 కేసులు)
ఇక కరోనా బారినపడి మహారాష్ట్రంలో ఇప్పటి వరకు 34 మంది మృతి చెందారు. ఆదివారం పుణెలోని ససూన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. పుణె జిల్లాలో ఇప్పటివరకూ కరోనా సోకి నలుగురు మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3374 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 472 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 79 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.