భారత్‌లో 124కి చేరిన కరోనా మృతులు

7 Apr, 2020 20:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 508 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,789కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 353 మంది డిశ్చార్జ్‌ కాగా, 124 మంది మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 868, తమిళనాడులో 621 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టుగా ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.(ఈ టెక్నిక్‌తో కరోనా వైరస్‌కు చెక్‌!)

మరిన్ని వార్తలు