శశిథరూర్‌కు అరెస్ట్‌ వారెంట్‌

22 Dec, 2019 11:39 IST|Sakshi

తిరువనంతపురం : కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు స్థానిక కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆయన రాసిన ‘ద గ్రేట్‌ ఇండియన్‌ నావెల్‌’ అనే పుస్తకంలో హిందూ మహిళలను అవమానపరిచాడని దాఖలైన కేసులో ఆయనకు ఈ  వారెంట్‌ జారీ చేయబడింది. వారెంట్‌లో తన వాదనను వినిపించడానికి శశిథరూర్‌ గానీ, లేదా ఆయన లాయర్‌గానీ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదని, అందుకోసం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్టు తెలపబడింది. ఈ విషయంపై శశిథరూర్‌ అఫీస్‌ వర్గాలు వివరణనిస్తూ.. ‘వారెంట్‌ జారీ అయినట్టు మాకు మీడియా ద్వారానే తెలిసింది. అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇంతకుముందు కోర్టుకు హాజరుకావాలని సమన్లు వచ్చాయి. అయితే అందులో ఏ తేదీన  హాజరు కావాలో లేనందున ఆ విషయాన్ని మేం కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. దీంత కోర్టు వారు తేదీతో సహా పేర్కొని మరోసారి నోటీసు జారీ చేస్తామన్నారు. దాని ఆధారంగా మా తదుపరి కార్యాచరణ ఉంటుంద’ని ఆఫీస్‌ వర్గాలు తెలిపాయి. ఈ పుస్తకం మొదటి ప్రచురణ 1989లో జరిగింది. కాగా, శశిథరూర్‌కు ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన విషయం తెలసిందే. చదవండి : (దేశ చిత్రపటంతో శశిథరూర్‌ వివాదాస్పద ట్వీట్‌)

మరిన్ని వార్తలు