మానవత్వంతో కరోనాను అధిగమిస్తాం: ప్రధాని

19 Apr, 2020 04:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా ముప్పును మానవత్వాన్ని ప్రదర్శించడం ద్వారా అధిగమిస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశానికే తాళాలు వేసుకున్న ఈ పరిస్థితుల్లో నిరుపేదలకు సాయం చేయడంలో కేంద్ర మంత్రులు శక్తివంచన లేకుండా చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ‘కోవిడ్‌పై ప్రపంచం కలసికట్టుగా పోరాడుతోంది. మానవత్వంతో ఈ విపత్తు నుంచి బయటపడతాం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న భారతీయులు కరోనాపై పోరాటానికి సంఘీభావంగా వెయ్యి మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని జెర్మట్‌లో ఎగురవేశారు. ఈ విషయాన్ని అక్కడి భారత ఎంబసీ ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌ని మోదీ రీ ట్వీట్‌ చేస్తూ కోవిడ్‌పై పోరాటంలో భాగస్వాములైన వారందరినీ అభినందించారు. ప్రత్యేకంగా కేంద్ర కేబినెట్‌లో మంత్రులు చేస్తున్న కృషిని కొనియాడారు.

>
మరిన్ని వార్తలు