'కరోనాపై పోరులో మీడియా ప్రముఖ పాత్ర'

13 Apr, 2020 16:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. ఈ సందర్భంగా మీడియాలోకేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటంలో వైద్యులు, నర్సులు, పోలీస్‌ సిబ్బంది మాదిరిగానే మీడియాలో పనిచేసే వారు కూడా ముందు వరుసలో ఉన్నారన్నారు. కరోనాపై పోరులో  పాత్రికేయులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

అయితే సంబంధిత​ శాఖల నుంచి సరైన సమాచారం లేకుండా కరోనా వైరస్‌కు సంబంధించిన వార్తలను ప్రచురించడం కానీ, టీవీలలో చూపించడం కానీ చేయొద్దని సూచించారు. ఇక తాజాగా ప్రధాని దేశ ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా.. ఆరోగ్యవంతమైన భారతం​ కోసం ప్రజల జీవితంతో పాటు దేశం ఆర్థిక వ్యవస్థ ముఖ్యమే అని సూచించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్రమంత్రులంతా సోమవారం రోజున తమ కార్యాలయాలకు వచ్చి వారి పనుల్లో నిమగ్నమవ్వడం ​విశేషం. కాగా.. భారత్‌లో ఇప్పటిదాకా 9,152 కేసులు నమోదుకాగా, గడిచిన 24 గంటల్లో 796 పాజిటివ్‌ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. చదవండి: పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్ 

మరిన్ని వార్తలు