చత్తీస్‌గఢ్‌లో పేలుడు : జవాన్‌ మృతి

31 Jul, 2019 09:11 IST|Sakshi

రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌లో​ మావోయిస్టుల ఆగడాలు కొనసాగుతున్నాయి. దంతెవాడ సమీపంలో బొద్లి ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఐఈడీ పేలుడులో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మరణించారు. మృతుడిని బీహార్‌కు చెందిన రోషన్‌ కుమార్‌గా గుర్తించారు. రోషన్‌ సీఆర్‌పీఎఫ్‌ 195వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

దంతెవాడ-జగ్ధాల్‌పూర్‌ బోర్డర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ శిబిరానికి 700 మీటర్ల దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. జవాన్‌ మృతదేహాన్ని చత్తీస్‌గఢ్‌లోని బర్సుస్‌ ప్రాంతానికి తరలించారు.

మరిన్ని వార్తలు