ఆర్మీ చీఫ్గా దల్బీర్ సింగ్ నియామకం

13 May, 2014 21:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ నియమితులయ్యారు. రక్షణ శాఖ పంపిన సిఫారసుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  జనరల్ బిక్రమ్ సింగ్ స్థానంలో దల్బీర్ సింగ్ స్థానంలో బాధ్యతలు చేపడుతారు. జూల్ 31న  బిక్రమ్ సింగ్ పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత దల్బీర్ సింగ్ ఆర్మీ చీఫ్గా కొనసాగుతారు. 59 ఏళ్ల దల్బీర్ సింగ్ ప్రస్తుతం ఆర్మీలో డిప్యూటీ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1987లో శ్రీలంకకు పంపిన భారత శాంతి పరిరక్షక దళంలో పనిచేశారు.

మరిన్ని వార్తలు