వాచ్ దొంగిలించాడని ..

17 Mar, 2016 19:21 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని బందాలో దారుణం చోటు చేసుకుంది.  వాచ్ దొంగిలించాడనే ఆరోపణలతో  సాతి గ్రామానికి చెందిన దళితుడు కొఠారి(42)ని కొట్టి చంపిన ఘటన కలకలం సృష్టించింది. గురువారం పోలీసులందించిన వివరాల ప్రకారం.. .. వాచ్  దొంగతనం చేశాడనే అనుమానంతో కొఠారిపై చున్మున్ పటేల్ అనే వ్యక్తి   దాడి చేశాడు. కర్రతో అతడిని విచక్షణా రహితంగా కొట్టాడు. 

 

దీంతో కొఠారి తీవ్రంగా గాయపడ్డాడు.   సమాచారం అందుకున్న  పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే కొఠారి మరణించినట్టు  వైద్యులు  తెలిపారు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసు అధికారి యశ్వీర్ సింగ్ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు