గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి..

16 Feb, 2016 17:03 IST|Sakshi
గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి..

ఉత్తరప్రదేశ్‌లోని దబౌలి గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. భూవివాదంలో పోలీసులకు ఫిర్యాదుచేశారనే అక్కసుతో  ఓ దళిత బాలుడిని దారుణంగా అవమానించారు. అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశాడనే ఆగ్రహంతో అతడికి గుండుకొట్టించి, మెడలో చెప్పుల దండ  వేసి ఊరంతా తిప్పారు. స్థానిక ఇటుకబట్టీ యజమాని, మరో ఇద్దరు ఉద్యోగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

అయితే ఇటుకబట్టీ నిర్వహించే స్థలానికి పక్కనే ఉన్న బాధితుల పూర్వీకుల భూమిని కబ్జా చేయడానికి వీరేంద్ర ప్రయత్నించడంతో వివాదం రాజుకుంది. తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నాడంటూ దళిత బాలుని తండ్రి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే సదరు యజమాని ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇటుక బట్టీ యజమాని వీరేంద్ర కుమార్ మిశ్రాతో పాటు మిగిలిన ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీస్ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు