న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దిశానిర్దేశం లేనిదని, ప్రజావ్యతిరేకమని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) విమర్శించింది. ఇది పేదలకు ఎలాంటి మేలూ చేయకపోగా, నిరుద్యోగాన్ని ప్రోత్సహించేలా ఉందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ఆరోపించారు. ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి ఒక్క చర్యను కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. కరెంటు, నీటి సమస్యల పరిష్కారానికి నిధులు అంటూ ఢిల్లీవాసులను కేంద్రం మోసగించిందని లవ్లీ అన్నారు.