ఢిల్లీలో లిక్కర్‌పై 70% స్పెషల్‌ కరోనా ఫీజు

5 May, 2020 05:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. ‘స్పెషల్‌ కరోనా ఫీజు’ పేరుతో మద్యం ధరలను 70 శాతం మేర పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. లిక్కర్‌ బాటిల్స్‌పై ఉండే గరిష్ట చిల్లర ధరకు ఇది అదనం. లాక్‌డౌన్‌ కారణంగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి ఈ నిర్ణయంతో అదనపు ఆదాయం సమకూర్చనుంది.

>
మరిన్ని వార్తలు