డ్రైవర్ అక్కర్లేని రైలు వచ్చేసింది..

4 Jun, 2015 18:42 IST|Sakshi
డ్రైవర్ అక్కర్లేని రైలు వచ్చేసింది..

ఢిల్లీ: ఢిల్లీ మోట్రోలోకి డ్రైవర్ లేకుండానే నడిచే మొదటి ట్రైన్ గురువారం వచ్చి చేరింది. సౌత్కొరియాలో తయారైన ఈ ట్రైన్ ముకుంద్ పుర్ డిపోకి చేరుకుంది...డ్రైవర్ లేకుండానే, ఢిల్లీ మెట్రో ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ ఇచ్చే ఆదేశాలో ఈ ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్లో ఒకేసారి 2,280 మంది ప్రయాణించవచ్చు. మిగతా ట్రైన్లకన్నా240 మంది ఎక్కవగా ప్రయాణించే సామర్థ్యం ఈ ట్రైన్ లో ఉంది. మామూలు ట్రైన్లలా డ్రైవర్ కోసం ప్రత్యేక క్యాబిన్ ఈ ట్రైన్కి ఉండదు. అంతేకాకుండా ఈ ట్రైన్కి లోపల, బయట సీసీటీవీ కెమరాలు అమర్చి ఉంటాయి. ఇవి తీసే చిత్రాలు డైరెక్ట్గా కంట్రోల్ రూం కి చేరుతాయి.
 

మరిన్ని వార్తలు