సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అత్యంత విషతుల్యంగా మారుతోంది. ప్రధానంగా శీతాకాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉంటోంది. ప్రస్తుతం ఢిల్లీలో బుధవారంతో పోలిస్తే.. గురువారం మరింత ప్రమాదకరంగా ఉంది. ఢిల్లీలో గాలి కలుషితవం కావడం వెనుక.. సమీప రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్లలో రైతులు తమ పంటను తగులబెట్టడం కూడా కారణంగా మారింది. దీంతో పాటు పలు కారణాల వల్ల ఢిల్లీ వాతావరణం, గాలి అత్యంత కాలుష్యంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీ కాలుష్యానికి కారణాలు