మహమ్మారి నీడన అతిపెద్ద మురికివాడ..

29 Apr, 2020 20:04 IST|Sakshi

మహమ్మారి విజృంభణతో విలవిల

ముంబై : మహమ్మారి బారినపడి విలవిలలాడుతున్న ముంబై మహానగరంలో అధికారులు, వైద్య సిబ్బంది ప్రాణాంతక వైరస్‌ నిరోధానికి పోరాడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నగరంలోని ధారావిలో పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

ధారావిలో బుధవారం 14 తాజా కేసులు నమోదయ్యాయని దీంతో ఆ ప్రాంతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 344కు ఎగబాకిందని అధికారులు వెల్లడించారు. ధారావిలో ఈ రోజు ఎలాంటి కోవిడ్‌-19 మరణాలు చోటుచేసుకోలేదని చెప్పారు. మహీంలో 3 పాజిటివ్‌ కేసులు నమోదవగా, దాదర్‌లో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు.

చదవండి : ముంబైలో చిక్కుకున్న మత్స్యకారులు

మరిన్ని వార్తలు