పార్టీ పటిష్టతకు కృషి చేస్తా : డీకే
బెంగళూర్ : కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల్లో ట్రబుల్ షూటర్గా పేరొందిన డీకే శివకుమార్ ఆ పార్టీ రాష్ట్ర చీఫ్గా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన డీకే శివకుమార్ గురువారం జరిగిన పార్టీ వర్చువల్ ర్యాలీలో నూతన బాధ్యతలు చేపట్టారు. పార్టీ చీఫ్గా పదవీబాధ్యతలు చేపట్టిన డీకేను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా అభినందించారు. లక్షలాది కార్యకర్తలు కలిసిరాగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించానని నేతలందరిని కలుపుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని డీకే ట్వీట్ చేశారు.