న్యూఢిల్లీ: డ్రగ్స్ మత్తులో ఇద్దరిని బలిగొన్న ఓ వ్యక్తికి ఢిల్లీ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దేశాన్ని మాదకద్రవ్యాల రహితరంగా మార్చాలని, యువత దీనికి దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలోఈ తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. బుధవారమిక్కడ అదనపు సెషన్స్ జడ్జి కామిని లావ్ తీర్పునిస్తూ ఇటీవల రేడియోలో ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని డ్రగ్స్కు బానిసవటం దేశానికి ముప్పు అనటాన్ని గుర్తు చేశారు.