తాగిన మైకంలో వాహనాలను తగలేశాడు..

7 Nov, 2018 11:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తాగిన మైకంలో ఓ వ్యక్తి  వాహనాలకు నిప్పుపెట్టిన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని మదన్‌గిర్‌ ప్రాంతంలో నాలుగు కార్లతో సహా 18 వాహనాలను తగులబెట్టిన తాగుబోతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 ద్విచక్ర వాహనాలు, నాలుగు కార్లను నిందితుడు తగులబెట్టాడని పోలీసులు తెలిపారు.

బైక్‌ల పెట్రోల్‌ ట్యాంక్‌ను తీసి అగ్గిపుల్లతో నిప్పుపెడుతున్న వ్యక్తి వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. వాహనాలు దగ్ధం కావడంతో సమీపంలో పార్క్‌ చేసిన కార్లు సైతం మంటల్లో చిక్కుకున్నాయని పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 3.05 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తమకు సమచారం అందినట్టు పోలీసులు పేర్కొన్నారు.

పరారీలో ఉన్న నిందితుడుని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు పూర్తిగా దగ్ధమవగా, ఆరు బైక్‌లు, రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

మరిన్ని వార్తలు