మద్యం మత్తులో భార్య శవంతో శృంగారం!

5 Jun, 2016 15:20 IST|Sakshi
మద్యం మత్తులో భార్య శవంతో శృంగారం!

న్యూఢిల్లీ: మద్యం మత్తులో ఓ 25 ఏళ్ల యువకుడు మృగాడిగా మారాడు. భార్యను ఇటుకతో కొట్టిచంపి.. ఆ తర్వాత ఆమె మృతదేహంతో లైంగిక కలాపాలకు పాల్పడ్డాడు. అనంతరం మద్యం మత్తులో శవం పక్కనే నిద్రపోయాడు.

గత నెల 30న పశ్చిమ ఢిల్లీలోని నిహాల్‌ విహార్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుడైన ప్రదీప్‌ శర్మను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ-రిక్షా డ్రైవర్‌ అయిన అతడు మద్యం మత్తులో భార్య మోనికాతో గొడవ పడ్డాడు. డబ్బు విషయమై భార్యాభర్తలు తరచూ గొడవపడేవారని, భార్యకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రదీప్‌ శర్మ అనుమానించేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో గత నెల 30న రాత్రి సమయంలో ఇంటిఅద్దె చెల్లించకపోవడంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అప్పుడు మద్యం మత్తులో ఉన్న ప్రదీప్ శర్మ ఒళ్లుతెలియని ఆవేశంలో ఇటుకతో భార్యను కొట్టిచంపి.. ఆ తర్వాత మృతదేహంతో లైంగిక కలాపాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఉదయాన్ని జరిగిన దారుణాన్ని గుర్తించిన ప్రదీప్‌ తన ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి పరారయ్యాడని, యూపీలోని నంగ్లోయి రైల్వేస్టేషన్‌లో తచ్చాడుతున్న అతడిని పక్కా సమాచారం ప్రకారం అరెస్టు చేశామని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు